హిందూపురంలో జనసేన ఆత్మీయ సమావేశం

హిందూపురం, స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నందు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ విచ్చేయడం జరిగింది. సమావేశంలో వారు మాట్లాడుతూ… జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి నాయకులకు మరియు సైనికులకు ప్రతి ఒక్కరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. మార్చి 14వ తేదీ ఆవిర్భావ సభకు అనంతపురం జిల్లా నుండి నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ను శాలువాలతో, బొకేలతో నాయకులు మరియు జనసైనికులు సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మరియు మండల అధ్యక్షులు, హిందూపూర్ నియోజకవర్గ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.