37వ డివిజన్ లో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో 37వ డివిజన్లో జనసేన భీమ్ యాత్ర సోమవారం యేలేటి సోనీ ఫోరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ.. సుమారు రెండునెలలుగా భీం యాత్రని కాకినాడ సిటిలో జరుపుతున్నామనీ, అమాయకులైన దళితులకి తమపట్ల ఈ వై.సి.పి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని, దురాగతాలని తెలియచేస్తూ చైతన్యపరుస్తున్నామన్నారు. దళితులకు కాంట్రాక్టులు ఇస్తున్నామని చెపుతూ.. అనుమతులు ఇస్తూ వారికికూడా తెలియకుండా వారి పేరుమీద వ్యాపారాలు చేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తునారనీ, ఏదైనా జరిగితే తమచేతికి మట్టి అంటకుండా జాగ్రత్తపడుతున్నారనారు. నోరుతెరిచి ప్రశ్నిస్తే కౄరంగా హింసించి అణిచేస్తున్న ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో బలసాడి శ్రీను, పినపోతు సత్తిబాబు, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, కార్యదర్శి ముత్యాల దుర్గాప్రసాద్, సుంకర సురేష్ బండి సుజాత, బోడపాటి మరియ, బట్టు లీల, మడత శాంతి, గంపల పైడితల్లి, ఓలేటి చినతల్లి, చోడిపల్లి సత్యవతి, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.