లాలుపురం గ్రామంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

ప్రత్తిపాడు నియోజకవర్గం: లాలుపురం గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినామని లాలుపురం జనసేన పార్టీ నాయకుడు కాటూరి శ్రీనివాసరావు మాష్టారు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వేడుకలలో భాగంగా ఉదయం బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న శ్రీ 79 అడుగుల శ్రీవీరాంజనేయస్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద గోత్రనామాలతోటి నిర్వహించి, లాలుపురం జనసేన పార్టీ ఆఫిస్ లో జన్మదిన కేక్ ను కటింగ్ చేసి అందరికీ స్వీట్లు, పండ్లు, పంపిణీ చేసినారు. అనంతరం గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు పలకలు, పెన్సిల్స్, పెన్నులు, ఫ్యాడ్స్, నోట్ బుక్స్ పంపిణీ చేశామని శ్రీనివాసరావు మాష్టారు అన్నారు. ఈసందర్భముగా 250 భవన నిర్మాణ కార్మికులతో జనసైనికులు, వీరమహిళలు యువకులు, సహపంక్తి భోజనం చేసినారు. ఈ భోజన కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మి దుర్గ, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజులు భోజనాలు ప్రారంభించినారు. ఈ సందర్భంగా గ్రామంలోని 150 మంది పేదలకు చెన్నం గోపి యూత్ & కాటూరి గోపి యూత్ ఆధ్వర్యంలో బియ్యం, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేయటం జరిగిందని అములోతు రాధ తేలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించి వారిని పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూదాబత్తుల శివయ్య, సజ్జల రవికుమార్, శీలం హరి, తన్నీరు క్రిష్ణ, ఆదూరి శివయ్య, జనసైనికులు, వీరమహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.