పాలకొల్లులో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

పాలకొల్లు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పాలకొల్లు మార్కెట్ యార్డ్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని చెన్నంశెట్టి గోవర్ధన్, తోట దుర్గా ప్రసాద్, అంబటి సాయి తేజ, సతీష్, కావురు యశ్వంత్, మరియు పాలకొల్లు నియోజకవర్గ జనసైనికులు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా మాజీ హోమ్ మినిస్టర్, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరీరామ జోగయ్య విచ్చేశారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారుగా 60 మంది రక్తదానం చేశారు. రక్తదాతలను జోగయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సినీ నిర్మాత బన్నీ వాసు, జిల్లా నాయకులు, బోనం చినబాబు, ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, బి. జె. పి రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కబర్ది, చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దాసిరెడ్డి శ్రీను అతిదులుగా హాజరై వారి సందేశాలను అందించారు. జోగయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇదేవిధంగా యువకులు మరిన్ని కార్యక్రమాలు చేయాలని నా పూర్తి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.