జనసేన మండల కార్యవర్గ సమావేశం

నగిరి నియోజకవర్గం వడమాల పేట మండలంలో జనసేన మండల కార్యవర్గ సమావేశానికి వడమాల పేట మండల పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మెరుపుల మహేష్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు ముని శేఖర్ యాదవ్ అధ్యక్షతన పలువురు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాద్యక్షులు శేషాద్రి మరియు కుమార్ ప్రధాకార్యదర్శి సునీల్ మరియు వీరమహిళలు పూర్ణిమ, రాజీ, నీరజ అలాగే జనసైనికులు పాల్గొనటం జరిగింది.