మంత్రాలయంలో జనసేన ప్రచారం

మంత్రాలయం నియోజకవర్గం, కౌతాళం మండలం పరిధిలోని కొంత మంది రైతులతో మంత్రాలయం నియోజకవర్గ జనసేన నాయకులు పొంత నరసింహులు కలిసి పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోను వారికి వివరించి ముందు ముందు జనసేన పార్టీ చేయబోయే అంశాలను వారితో చర్చించడం జరిగింది. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరల విషయాలను, పెంచిన డీజిల్ పెట్రోల్ రేట్లు వివరిస్తూ ముందు ముందు పార్టీ చేయబోయే అంశాలను వారితో చర్చించడం జరిగింది. అలాగే కార్యక్రమంలో మండల జనసైనికులు కూడా పాల్గొన్నారు.