పల్లె పల్లెకు జనసేన సిమెంట్ బెంచీలు

మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పల్లె పల్లెకు జనసేన సిమెంట్ బెంచీలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మర్రిపాడు మండల పరిధిలోని సెంటర్లో సిమెంట్ బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల అధ్యక్షురాలు శ్రీమతి ప్రమీల ఓరుగంటి ఉపాధ్యక్షులు ఈరుపోతు ఉదయ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి మాట్లాడుతూ… భవిష్యత్తులో జనసేన పార్టీ బలోపేతం కోసం మండల పరిధిలోని జనసైనికులు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. మండల ఉపాధ్యక్షులు మాట్లాడుతూ… ఈ బెంచీలకు సహకరించిన జనసేన నాయకులు బాలాజీ నాయుడుకి మర్రిపాడు మండల జనసేనపార్టీ తరుపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల నాయకులు చిన్నా జనసేన, కన్నెమరకల తిరుపతయ్య, ప్రకాష్, నాయబ్, ఏడుకొండలు, శ్రీను, ఓరుగంటి పద్మ, యలకచర్ల బుజ్జమ్మ స్థానికులు పాల్గొన్నారు.