కంబదూరులో జనసేన చలివేంద్రం

కళ్యాణదుర్గం, కంబదూరు మండల అధ్యక్షులు చంద్రమౌళి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరుపున చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వేసవికాలం మొదలై విపరీతమైన ఎండల తాకిడికి వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహర్తిని గుర్తించి, త్రాగడానికి నీరు లేక ప్రజలు ఇబ్బంది పడకూడదు అని కంబదూర్ టౌన్ లో జనసేన పార్టీ తరఫున జనసైనికులు, నాయకుల సహాయ సహకారంతో 1000 మందికి పైగా మజ్జిగ పంపిణీ, ఇంకా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ కృష్ణ దేవరాయలు, డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంబదూరు మండల అధ్యక్షులు చంద్రమౌళి, మండల నాయకులు శ్రీనివాసులు, తిప్పేస్వామి, అనిల్ , వెంకటేష్, సురేష్, నరేష్, మంజునాథ్, జగదీష్, సాయితేజ, గండికోట జగదీష్, శ్రీనాథ్, సతీష్, చరణ్, పవన్, చంద్ర, మధు, సీన, ప్రకాష్, అనిల్, తేజ, మనోజ్, శ్రీకాంత్, గోవిందు, కిరణ్, వంశీ, చంద్ర, శివ, శేకర్, రవి, నరేంద్ర, అజయ్, రాజు, నవీన్, అనిల్, గోపాల్, పవన్, శ్రీనాథ్, సందీప్, ధను, రాజేష్ బాగేపల్లి తదితర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.