జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు జనసేన శ్రేణులకు ధన్యవాదములు తెలిపిన వై.శ్రీనివాస్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-29-at-3.29.10-PM-1-723x1024.jpeg)
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం చేసే దిశలో, శుక్రవారం సాయత్రం ఒక పిఏసి సభ్యుడిని, నాలుగు కార్పొరేషన్స్ అధ్యక్షులను నియామకం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా వై.శ్రీనివిస్ స్పందిస్తూ… నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన గౌ. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో చారిత్రాత్మక నగరంగా పేరొందిన రాజమండ్రి కార్పొరెషన్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అధ్యక్షునిగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సొంత మనిషిగా, అందరిని కలుపుకుని వెళుతూ, సౌమ్యునిగా పేరున్న వై. శ్రీనివాస్ ను నియమించటం జరిగింది. అంతేకాదు వై.శ్రీనివాస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని తూర్పుగోదావరి జిల్లాలోనూ రాజమండ్రిలోనూ బలపరచటంలో, పవన్ కళ్యాణ్ అభిమానులను పార్టీ కార్యకర్తలుగా మార్చటంలోనూ, ఎంతో కీలకపాత్ర పోషించారు. వై.శ్రీనివాస్ కు పదవి రావటంతో రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కార్యకర్తలు హర్షం వ్యక్తపరచి, శుభాకాంక్షలు తెలియజేసారు. తనకు కీలకమైన రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కీ, నగర ఇన్ చార్చ్ అనుశ్రీ సత్యనారాయణ కి వై.శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. నగరంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని, అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ, కులాలను కలిపి ఆలోచనా విధానాలతో, మతాల ప్రస్తావన లేని రాజకీయ చేస్తూ, చారిత్రాత్మక నగరమైన రాజమహేంద్రవర సంస్కృతులను కాపాడుతూ, అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తూ, ఈ పదవిని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తానని, నిరంతరం ప్రజా సమస్యపై పోరాడతామని తెలుయజేసారు అలాగే తనకు శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర నాయకులకు, పలు నియోజకవర్గ ఇన్ చార్చ్ లకు కార్యకర్తలకు, వీరమహిళలకు, జనసైనికులకు వై.శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-29-at-3.29.10-PM-723x1024.jpeg)