గ్రామ సమస్యల పై ఎంపిడిఓ కి వినతి పత్రమిచ్చిన వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం కొత్త వీరపురం అరుంధతి వాడలో నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా నో మై కాన్స్టిట్యుఎన్సి కార్యక్రమం సందర్భంగా గ్రామంలో పర్యటించినప్పుడు జనసేన పార్టీ దృష్టికి ప్రజలు తీసుకుని వచ్చిన సమస్యలు ప్రధానంగా డ్రైనేజ్ కాలువలు, పారిశుధ్యం, త్రాగునీరు, స్ట్రీట్ లైట్స్, శ్మశానవాటిక ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలని శనివారం నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా ఏర్పేడు మండల ఎంపిడిఓ ని గ్రామ ప్రజలు, నాయకులతో కలిసి వెళ్లి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని ఎంపిడిఓ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్, నాయకులు నితీష్ కుమార్, వినోద్, చందు చౌదరి, తేజ, గిరీష్, జనసైనికులు పాల్గొన్నారు.