జనంకోసం జనసేన 220వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ

జగ్గంపేట, జనంకోసం జనసేన 220వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతుల మీదుగా జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా బుధవారం 90 మొక్కలు పంచడం జరిగింది. 221వ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో జనంకోసం జనసేన కొనసాగుతుంది. అవకాశం ఉన్న జనసైనికులు అంతా రేపటి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా నాయకులకు, మండల అధ్యక్షులకు, మండల కమిటీ సభ్యులకు, అనుబంధ కమిటీ అధ్యక్షులకు, అనుబంధ కమిటీ సభ్యులకు, వీర మహిళలకు మరియు జనసైనికులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.