ఋషింగి కిమ్మి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని జనసేన డిమాండ్

శ్రీకాకుళం జిల్లా, రాజాం, పాలకొండ నియోజక వర్గాలకు చెందినటువంటి ఋషింగి కిమ్మి బ్రిడ్జ్ గత పది సంవత్సరాలుగా అలానే పెండింగ్ లో ఉంది. దాదాపు ఐదుగురు ముఖ్య మంత్రులు మారినా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాజాం నియోజకవర్గ జనసేన నాయుకులు ఎన్ని రాజు, వీరఘట్టం జనసేన నాయుకులు వజ్రగడ జానీ మాట్లాడుతూ.. ఈ బ్రిడ్జి ఎన్నో గ్రామాలకు ఒక మంచి రహదారి.. దీనిని పూర్తి చేసేంత వరుకూ.. జనసేన పోరాడుతూనే ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. సకాలంలో బ్రిడ్జ్ ను పూర్తి చెయ్యకపోతే మా నాయుకులు కొణిదల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రౌతు గోవిందా, కిమ్మి గెడగాం, సరసన్నబిల్లి, కొప్పరవలస ఋషింగి జనసైనికులు పాల్గోన్నారు.