డ్రింకింగ్ వాటర్ కాంట్రాక్టు వర్కర్స్ నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన
రాజమండ్రిలో సీ.ఐ.టి.యూ వారి ఆధ్వర్యంలో .. డ్రింకింగ్ వాటర్ కాంట్రాక్టు వర్కర్స్ తమ 8 నెలల జీతాల బకాయిలు వెంటనే చెల్లించి, ఇతర సమస్యలపై కూడా త్వరితగతిన స్పందించాలని నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, రాజమండ్రి నగర అధ్యక్షులు వై.శ్రీనివాస్ పాల్గొని వారికి సంఘీభావం తెలియజేసారు.