ఆదిశంకర కళాశాలల బస్సులను సీజ్ చేయాలని జనసేన డిమాండ్

విద్యార్థులతో వెళ్తున్న ఆదిశంకర కళాశాల బస్సు అదుపుతప్పిన ఘటనలో విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలపాలైన విద్యార్థులను పరామర్శించిన జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మరియు జనసేన కార్యకర్తలు. గాయపడిన విద్యార్థులను పరామర్శించి, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడటం జరిగింది. రవాణా శాఖ అధికారులు వెంటనే కండిషన్లో లేని ఆదిశంకర కళాశాల బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్, సుమన్, మణి మరియు జనసైనికులు ఉన్నారు.