మార్కాపురం జిల్లా చేయాలని జనసేన డిమాండ్

ప్రకాశం జిల్లా గిద్దలూరు, నియోజకవర్గం కంభం మండల కేంద్రములో, మార్కాపురం జిల్లా కావాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఏర్పాటు చేసిన శిబిరంలో పాల్గొన్న జనసేన జిల్లా కార్యదర్శి లంకా నరసింహా రావు, మార్కాపురం జిల్లాగా కావలసిన అవసరం ఉందని, ప్రజలందరు జిల్లా కేంద్రం ఒంగోలు ప్రయాణించాలి అంటే ప్రజలు ఇబ్బంది ఎదుర్కుంటున్నారు. కావున ప్రభుత్వం మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా చేయకపోతే ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందిని ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్ కి తెలియ పరిచామని ఆయన పవన్ కళ్యాణ్ దృష్టికి తెలియపరిచి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్తానని హమీ ఇచ్చారు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా జేఏసి నాయకులు షేక్ సైదా పాల్గొన్నారు.