మాధవరంలో జగనన్న కాలనీలలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

రాజంపేట నియోజకవర్గం: సిధ్ధవటం మండలం, మాధవరం గ్రామంలో సుమారు 300ఇల్లు నిర్మాణం అని చెప్పి ఆ కాలనీకీ రహదారి, త్రాగునీరు అందివ్వలేదు. జాతీయరహదారినుండి కాలనీకి వెల్లాలంటే ఒకటిన్నర కిలోమీటర్ కాలినడకన రైల్వే బ్రిడ్జి కింద నడుచుకుంటూవెళ్ళాలి. వర్షం వచ్చిందంటే వెళ్ళడానికి దారిలేదు. రైలు బ్రిడ్జి ఎక్కి దిగాలి ప్రజలు దాటేటపుడు రైలు వస్తే ప్రమాధం జరిగే అవకాశం వుంది. కాలనీకీ జగనన్న పేరు పెడితే సరిపోదు వసుతులు కూడ కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం జిల్లా లీగల్ అధ్యక్షుడు కరుణాకర్ రాజు, నియోజకవర్గ నాయకులు వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు కొట్టే వెంకట రాజేష్, సుబ్బయ్య పాల్గొని కాలనీ సందర్శించి ప్రజలతో ముఖాముఖి నిర్వహించి, రాబోయేది జనసేన ప్రభుత్వమేనని, అన్ని వసతులు కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది.