Tuni: తూర్పుగోదావరి జిల్లాలో జనసేన జోరు

తూర్పు గోదావరి జిల్లాలో జనసేన టాప్ గేర్ వేసింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువత, ఆడపడుచులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. తుని నియోజకవర్గం తొండంగి మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, వైసీపీ నేత జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. బుధవారం అదే నియోజకవర్గం నుంచి మరో 200 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత జనసేన పార్టీలో చేరారు. వీరందరినీ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను సత్కరించారు.