సఖినేటిపల్లి లంకలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా జనసేన పార్టీ తరఫున ఈ నెల 18, 19, 20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 9.00 గంటలకు రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక ప్రధాన కూడలిలో జరిగిన కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ , గ్రామ సర్పంచ్ రేపూరి యేసు, సఖినేటిపల్లి లంక గ్రామ అధ్యకులు మార్గాన ఏడుకొండలు, జనసేన నాయకులు గునిశెట్టి రాంబాబు(రాంజీ), రేపూరి వాసు, ముత్యాల ఫణి, ముచ్చర్ల వెంకటేష్, నాయుడు కృష్ణ, కే. కోటి, గునిశెట్టి కృష్ణ, కోనసీమ, జమిశెట్టి నాగు, యెడ్ల రామలింగేశ్వరరావు, పడవల సాయి భవాని, ముచ్చర్ల గోపి మరియు జనసైనికులు పాల్గొన్నారు.