విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

తణుకు, ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా తణుకు నియోజకవర్గం, అత్తిలి మండలం, ఊరదళ్లపాలెం గ్రామ రోడ్డు పరిస్థితిపై జనసేన తణుకు నియోజకవర్గ ఇంచార్జి, విడివాడ రామచంద్రరావు, అత్తిలి మండల ప్రెసిడెంట్, దాసం ప్రసాద్, అత్తిలి జనసేన నాయకులు, గ్రామ నాయకులు, జనసేన సైనికులు, కలిసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఊరదళ్లపాలెం గ్రామంలో పూర్తిగా పాడైపోయినా రోడ్లలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు.ఎన్నికల ముందు కారుమూరి వెంకట నాగేశ్వరావు ఎన్నికల ప్రచారంలో ఊరదళ్ళపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నానని ప్రకటంచారు. అయన దత్తత తీసుకుని 3సంవత్సరాలు అయింది. ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పటికైనా దత్త మంత్రి మొద్దు నిద్ర వదిలి గ్రామంలోని రోడ్లపై చర్యలు తీసుకోని రోడ్లు వేయించాలని కోరుకుంటున్నామని తెలిపారు.