వరద బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులందించిన జనసేన

సర్వేపల్లి నియోజకవర్గం, అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న వెంకటాచలం మండలం కనుపూరు గ్రామ గిరిజన కుటుంబానికి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం బస్తా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా గిరిజనుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజుల నుంచి అకాల వర్షాలతో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేతిలో పని లేక, అధికారులు ఆదుకోక నానా పాట్లు పడుతున్నారని అన్నారు. అధికార పార్టీ ఇప్పటివరకు వారికి ఏ విధమైన సహాయం అందించక పోవడంతో వాళ్లు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ అధికారులు ఇకనైనా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని లేకుంటే జనసేన పార్టీ గిరిజనులకు అండగా నిలబడి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కాకి శివకుమార్, సందీప్, వంశీ తదితరులు పాల్గొన్నారు.