ఆమంచిని సత్కరించిన కనిగిరి జనసేన

కనిగిరి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు చీరాల నుండి సి.ఎస్.పురం రోడ్డు మార్గాన వెలుతూ కనిగిరిలోని నియోజకవర్గ పార్టీ ఆఫీస్ దగ్గర మండల అధ్యక్షుని పిలుపుమేరకు ఆగడంతో వారికి కనిగిరి నియోజకవర్గం నాయకులు ఘనంగా సత్కరించి భారీ ర్యాలీగా తీసుకెళ్లారు. ఆమంచి స్వాములు పార్టీ ఆఫీసుని సందర్శించి కనిగిరి నియోజకవర్గంలోని పార్టీ అభివృద్ధి నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి అలాగే ఆమంచి స్వాములు పాత మిత్రులను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనిగిరి మండల అధ్యక్షుడు రమేష్, జనసేన నాయకులు డాక్టర్ రామానాయుడు, అంజి నాయుడు, రవీంద్ర తమ్మిశెట్టి, నరేష్ ముత్యాల, కటకం కళ్యాణ్, గురు ఈశ్వర్, శీలం రవి, మధుబాబు, చరణ్, వంశి, చంటి, భాస్కర్, అభిషేక్, మార్క్, బాలు, అజయ్, సాయి కిషోర్, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు.