చెరపల్లి గ్రామంలో జనసేన విస్తరణ సమావేశం

చింతపల్లి మండలం,లోతుగడ్డ పంచాయితీ,చెరపల్లి గ్రామంలో జనసైనికుడు దేపురు రాజు గారి యొక్క సోదరి దేపురు దారాలమ్మ(నందిత), వేణుగోపాల్ వివాహనికి హాజరైన జనసేన పార్టీ ఇన్చార్జి(అరకు పార్లమెంట్) డాక్టర్ వంపురు గంగులయ్య. వధువును ఆశీర్వదించి, పెద్దలతో మాట మంతి, తర్వాత తోటి జనసైనికులతో వివాహవిందుకు హాజరయ్యారు. అనంతరం లోతుగెడ్డ జనసైనికులు, రామరాజు, రాజు, సత్తిబాబు, మోహన్ రామకృష్ణ, చిరంజీవి, దాస్, సోమరాజు తదితరులతో సమావేశమై పార్టీ యొక్క విస్తరణ యువత యొక్క ప్రధాన పాత్ర విషయమై చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంపురు గంగులయ్య, జనసేన పార్టీ ఇన్చార్జి అరకు పార్లమెంట్ జి.మాడుగుల మండల నాయకులు షేక్ మస్తాన్, పాడేరు మండల జనసేన ఉపాధ్యక్షులు సాలేబు అశోక్, చింతపల్లి జనసేన నాయకులు బుజ్జిబాబు, దేపురు రాజు, స్వామి, రవికుమార్, చిట్టిబాబు, రామ్ పాల్గొన్నారు.