విలేకరుల దీక్షకు మద్దతు తెలిపిన జనసేన

మదనపల్లె నియోజకవర్గం, ఇంటి పట్టాలు కోసం మూడు రోజులు నుండి ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మదనపల్లె విలేకరుల సంఘం మాజీ అధ్యక్షుడు గుబిలిగారి రమేశ్ కి మరియు విలేకరులకి సంఘీభావం తెలిపిన మదనపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు తులసి శ్రీనివాస్, రమణారెడ్డి, దారం హరి, ఆకుల శంకర, భాగ్యరాజా, రెడ్డి రమేష్ పాల్గొన్నారు. డిమాండ్ పూర్తి చేయకుండానే విలేకరుల దీక్షను బలవంతంగా విరమింపచేసి ఆసుపత్రికి తరలించిన ఒకటవ పట్టణ పోలీసులు, పోలీసుల చర్యను జనసేన పార్టీ తరపున ఖండించిన దారం అనిత.