వైద్య అవసరాల నిమిత్తం హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ తో కలిసి జనసేన ఆర్ధిక సాయం

నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో ప్రత్తి సతీష్ భార్య వైద్య అవసరాల నిమిత్తం హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ తో జనసేన సంయుక్తంగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి అండగా ఉంటామని భరోసా కలిపించటం జరిగింది. ఈ కార్యక్రమంలో హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పురాణపండ భాస్కర శ్రీనివాస్ శర్మ మరియు హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ ద్విభాష్యం శంకర హనుమత్ ప్రసాద్ శర్మ మరియు జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి సాదా వెంకటేష్, పప్పొప్పు శ్రీను, రంకిరెడ్డి ప్రసాద్, పువ్వల సదాశివ గోపి పాల్గొన్నారు.