క్రియాశీలక సభ్యత్వ ప్రయోజనాలను ఆటో యూనియన్ సభ్యులకు వివరించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన ఆటో యూనియన్, నాయకులు, ఆటో డ్రైవర్ల తో మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆటో నడిపే డ్రైవర్ల కు జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ భీమా వాళ్లకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోకా బాలప్రసాద్, జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, నూకల దుర్గబాబు, మండల కార్యదర్శి సంసాని పాండురంగ, పిల్లి గోపి, మండల కోసాధికారిని గిడ్డి రత్నశ్రీ, రాగుర్తి ఏసోబు, శ్రీనివాస్, సత్యనారాయణ, వై.శ్రీనివాసరావు గ్రామస్తులు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.