క్యాన్సర్ బాధితురాలికి జనసేన ఆర్థిక సాయం

కందుకూరు: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళే జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, గుడ్లూరులోని మిట్టపాలెంనకు చెందిన ఉటుకూరి బాలమ్మకు కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఇనకొల్లు శ్రీనివాస్ ఆర్థిక సాయంతో స్థానిక జనసైనికుడు ఆలా శివ ప్రోత్సాహంతో సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలా శివ మాట్లాడుతూ బాలమ్మకు క్యాన్సర్ వ్యాధితో ఇటీవల చెన్నై ఆసుపత్రిలో చికిత్స చేయించారు. వీరి కుటుంబం రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం, భార్య, భర్తలు ఇరువురు కూడా పనిచేయలేని పరిస్థితి. ఇలాంటి వారికి మా జనసేన తరపున 5 వేల రూపాయల ఆర్థిక సాయం ఉడతాభక్తి వంటిదే, అని చెప్పారు. బాలమ్మ గారి వ్యాధి తీవ్రత గూర్చి పార్టీ అధ్యక్షుడు దృష్టికి తీసుకు వెళ్తామని ఇనకొల్లు శ్రీనివాస్ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల జనసైనికులు మూలగిరి శ్రీనివాస్, అనిమిశెట్టి మాధవ రావు, అన్నంగి చలపతి, ఆలా శివ, కొనికి రాజేష్, ఆలూరి ప్రతాప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.