విజయవంతంగా లంకమ్మ మాన్యంలో జనం కోసం జనసేన
అవనిగడ్డ: జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో మరియు టౌన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జనసేన పార్టీ నాయకుల సమక్షంలో సోమవారం జనం కోసం జనసేన కార్యక్రమం భారీ ఎత్తున జన సందోహంతో దిగ్విజయంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ రాయపూడి వేణుగోపాలరావు, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం కార్యదర్శి లంకే యుగంధర్, ఉమ్మడి కృష్ణా జిల్లా లీగల్ సెల్ జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ బాసు నాంచారయ్య నాయుడు, మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు రత్న గోపాల్, అవనిగడ్డ మండల ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీహరి, మరో అవనిగడ్డ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి భోగిరెడ్డి నాగేశ్వరావు, మరియు మోపిదేవి మండల జనసేన పార్టీ నాయకులు, కోడూరు మండల జనసేన పార్టీ నాయకులు, చల్లపల్లి మండల జనసేన పార్టీ నాయకులు, మరియు నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసేన పార్టీ కుటుంబం భారీగా తరలివచ్చి వందల సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిన జిల్లాస్థాయి నాయకులకు, నియోజకవర్గ స్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు, అందరికీ అవనిగడ్డ మండల కమిటీ తరఫున రాజనాల వీరబాబు తరపున ధన్యవాదాలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-8.42.17-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-8.42.22-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-8.42.19-PM-1024x461.jpeg)