పవన్ కళ్యాణ్ పై వైసిపి వ్యక్తిగత దాడిని ఖండిస్తూ జనసేన నిరసన

గుంతకల్: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ పై వైసిపి చేస్తున్నటువంటి వ్యక్తిగత దాడిని ఖండిస్తూ పామిడి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ధనుంజయ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, అనంతపురం జిల్లా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి అరికెరి జీవన్ కుమార్, గుత్తి పట్టణ అధ్యక్షులు పాటిల్ సురేష్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ధనుంజయ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే ఇక ఉపేక్షించం మీకు అధికారం ఇక ఆరు నెలలు మాత్రమే రానున్న ఎన్నికలలో విజయం మా నాయకుడిదే, ఆడవారిని అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి కార్యకర్తకి ముఖ్యంగా వైసిపి సలహాదారుడు సజ్జల కుమారుడు నియమించుకున్నటువంటి గాలి వెధవలకి ఒక్కటే చెబుతున్నాం రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఏర్పరచబోయే ప్రభుత్వంలో మీరు చేస్తున్నటువంటి వ్యక్తిగత దాడిపై చట్టపరంగా కఠినమైన శిక్షలు పడుతాయని గుర్తుపెట్టుకుని జాగ్రత్త వహించవలసిందిగా జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మహిళలకు, ఉద్యోగస్తులకు, యువతకు ఏమి చేయని ఇలాంటి ప్రభుత్వాలు అవసరమా అని మాట్లాడారు, వైసిపి వారు చేతనైతే ప్రజలకు చేసింది చెప్పండి, చేయనిది ప్రజలకు వివరించండి. ప్రతిపక్షాలు ప్రజల పక్షాన వారి సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అన్నది గమనించి ప్రజా సమస్యలపై వివరణ ఇవ్వండి వ్యక్తిగత జీవితాల గురించి తప్పుగా మాట్లాడి రానున్న రోజుల్లో ఇబ్బందులకు గురి కాకండి జాగ్రత్త వహించాల్సిందిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పామిడి మండల జనసేన పార్టీ నాయకులు రాము, అనిల్ కుమార్, శివకుమార్, అబ్దుల్, శరత్ కుమార్, భాస్కర్ గౌడ్, ధన, రత్న రంగరాజు, శబరీష్ మాబు, మొహమ్మద్ హబీబ్ మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన చేపట్టారు.