మదనపల్లె రూరల్ మండలంలో జనం కోసం జనసేన

రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరికు సమస్యలు విన్నవించిన కాలనీవాసులు

మదనపల్లె: పాలకులు మారుతున్నారు కానీ సమస్యలు మాత్రం తీరడం లేదని మదనపల్లె రూరల్ మండలం బృందావన్ కాలనీ ప్రజలు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి ఎదుట వాపోయారు.‌ ఆదివారం జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి ఆద్వర్యంలో మదనపల్లె రూరల్ మండలంలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటి విభాగం నాయకులు జగదీష్, కుమార్, రెడ్డెమ్మ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.