ముస్లింలకి అండగా జనసేన జనవాణి: ముల్లా మున్వర్ బాషా

రాష్ట్రంలో ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోతే జనసేన పార్టీ నిర్వహించే జనవాణి జనసేన బరోసా కార్యాక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావాలని.. తద్వారా మీ సమస్యలపై జనసేన పార్టీ పోరాడుతుందని.. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్లా మున్వర్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా మున్వర్ బాషా మాట్లాడుతూ.. జులై3 వతేదిన విజయవాడలోని మాకినని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం3 గంటల వరకు జనవాణి జనసేన భరోసా కార్యాక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహిస్తుందని.. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని.. మండలం నుంచి జిల్లా స్ధాయి దాకా ముస్లిం సోదరులు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుపుకోవచ్చు అని కోరారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ చెన్న రెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నేత్రత్వంలో పార్టీ బలోపేతం అవుతుంది నెల్లూరు జిల్లాలో త్వరలో చాలా మంది ముస్లిం పెద్దలు జనసేన పార్టీలో చేరాబోతున్నారు. జగన్ ముహన్ రెడ్డి గారు ముస్లింలకు చేస్తున్న అన్యాయం ముస్లింలు భరించలేరు అని.. ఇప్పకటికే దుల్హన్ పధకం ద్వారా ముస్లిం సోదరులకు గత ప్రభుత్వలు 50,000 రూపాయలు ఇచ్చేవి.. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే లక్ష రూపాయలు ఇస్తాను అని అబద్దాలు చెప్పి ముస్లిం చేత ఓట్లు వేయించుకోని.. ఇప్పుడు అధికారం లోకి వచ్చిన తరువాత ముస్లిం సోదరులను మోసం చేశారు అని అన్నారు. ఈ దుల్హన్ పధకం గురించి ఇప్పటకే మా పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.. రానున్న రోజుల్లో మా జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లింలకు ఇస్తున్న హామీలను ప్రతి ఒక్కటి కూడా తీరుస్తాం. ముస్లింలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు. ముస్లింలకు అబద్దాలు చెప్పి అధికారంలోకీ వచ్చిన ఈ వైస్సార్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి.. అందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కృషి చేయాలి అని తెలియజేసారు.