సింగవరంలో జనం కోసం జనసేన – మహాపాదయాత్ర

  • జనసేన పార్టీ యువజన నాయకులు తోట పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా కొనసాగిన మహాపాదయాత్ర
  • తోట పవన్ కుమార్ కు హారతులతో స్వాగతం పలికిన గ్రామ ప్రజలు
  • ముందుగా గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తోట పవన్ కుమార్

రాజానగరం: సీతానగరం మండలం, సింగవరం గ్రామంలో జనం కోసం జనసేన – మహాపాదయాత్రలో భాగంగా జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో కలిసి పాదయాత్రగా ఆదివారం గ్రామంలో ప్రతీ ఇంటికీ, ప్రతీ గడపకూ వెళుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీ సిద్దాంతాలను వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, పోకెట్ బ్యాడ్జ్, బొట్టు బిల్ల ప్యాకెట్ అందజేసిన యువజన నాయకులు తోట పవన్ కుమార్.
జనసేన కార్యకర్తలు, యువత, వీరమహిళలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు.