జనసేన ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం

ధర్మవరం నియోజకవర్గం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ధర్మవరం పట్టణంలోని 1వ వార్డ్ గూడ్ సెట్ కొట్టాల్, 40వ వార్డ్ గుట్టకింద పల్లిలో నిర్వహించడం జరిగింది. జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజల కష్టాలను తెలుసుకొని తప్పకుండా జనసేన-తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం కొంతమంది వృద్ధులకు గత కొన్ని నెలలుగా పెన్షన్ రాలేదని అలాగే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్సలు బాగోలేదని వాపోయారు. తప్పకుండా జనసేన, టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే వారి యొక్క సమస్యలన్నీ తీరుస్తానని వారికి హామీ ఇచ్చి ధర్మవరంలో రౌడీ రాజ్యాన్ని పోగొట్టి ఈ వైసీపీ పాలనను అంతమోందించేందుకు ధర్మవరం ప్రజలంతా సహకరించి రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీనీ గెలిపించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
టిడిపి నాయకులు బిల్లే సీన, శేషాద్రి, వుజ్జినప్ప, షేక్షావలి మరియు జనసేన పార్టీ నాయకులు మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, బత్తలపల్లి మండల కన్వీనర్ పర్రం శెట్టి రవి, పట్టణ నాయకులు పాల్గొన్నారు.