సీతానగరం గ్రామంలో జనం కోసం జనసేన

  • జనం కోసం జనసేన 593వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 593వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం సోమవారం జగ్గంపేట మండలం, సీతానగరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 400 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకూ నియోజకవర్గం మొత్తంగా 97610 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 594వ రోజు మంగళవారం గోకవరం మండలం, జగన్నాథపురం మరియు సూదికొండ గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవి తెలిపారు. సోమవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల రైతు కమిటీ అధ్యక్షులు సింగం వాసు, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి సింగం శ్రీనివాస్, సీతానగరం నుండి సింగం శివ, సింగం పవన్, సింగం నాగు, సింగం నాని, సింగం నాగు, సింగం సతీష్, సింగం ఫణి, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజులకు పాటంశెట్టి శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు.