ఆనారోగ్యంతో బాధపడుతున్న పండుకి ఫిజియోథెరపీ చేయించిన జనసేన

అమలాపురం, ఈనెల 16 వ తారీఖున తాండవపల్లి గ్రామంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న పండు కుటుంబానికి ఆర్థికసాయం చేసినప్పుడు అతనికి జనసేన పార్టీ తరపున 15 రోజులు ఫిజియోథెరపీ చేస్తామని తెలియజేసిన జనసేన పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస. అందులో భాగంగా లింగోలు పండు పిలుపు మేరకు మొదటి రోజు వైద్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.