ముఖ్యమంత్రి కళ్లలో ఓటమి భయం కనిపిస్తోంది

  • వారాహి యాత్రలో జన ప్రభంజనం చూసి వైసీపీ నాయకులకు గుండెల్లో భయం మొదలైంది

ఆలూరు నియోజకవర్గం: వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం ముఖ్యమంత్రి కళ్లలో కనిపిస్తోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాట జగన్ రెడ్డిని భయపెడుతోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తలుచుకొని వైసీపీ పాలకుల నాయకులు రాత్రిళ్లు నిద్ర కూడా రాని పరిస్థితి ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకే నోటికి ఏదోస్తే అది మాట్లాడుతున్నారని వైసీపీ పాలకుల నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన ఎరుకుల పార్వతి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆదివారం పార్వతి విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడుతూ.. మంత్రులు ఎమ్మెల్యే స్థానంలో ఉండి ప్రజల గురించి ఆలోచించాల్సిన వ్యక్తిలు ప్రతిపక్షాల గురించి విమర్శలు చేయడం అంటే పాలన గాలికి వదిలేశారు అని చెప్పడమే. వైసిపి పాలకుల నాయకులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే స్క్రిప్టు వ్రాసుకుని మీడియా ముందుకు వచ్చారని అన్నారు. వారాహి యాత్రలో జన ప్రభంజనం చూసి ఓర్వలేక వైసీపీ పాలకులకు నాయకులకు గుండెల్లో భయం మొదలైంది అందుకే ఒంటరిగా రా.. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించుని మా నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు 175 నియోజకవర్గాల వరకు ఎందుకు వెళ్తారు కొన్ని నియోజకవర్గ గ్రామాల్లో రోడ్డు లేని పరిస్థితి ఉందని కనీస నిండు గర్భిణులకు అర్ధరాత్రి పురిటి నొప్పులు వస్తే అంబులెన్స్ వెళ్లలేని దుస్థితి ఉందని అన్నారు. దమ్ముంటే రోడ్డు లేని గ్రామాలకు రోడ్లు వేయించండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే స్క్రిప్టు వ్రాసుకుని మీడియా ముందుకు రావలసిన అవసరం లేదని అన్నారు. 2024లో కూడా ప్రజలు పట్టం కడతారని పగటి కలలు కంటున్నార 175 నియోజకవర్గాల ప్రజలు మీ చేతిలో కీళ్ల బొమ్మలు కాదని ప్రజలు ఒక అవకాశం ఇచ్చి చూడాలని చూసారా తప్ప ప్రజలు మళ్ళీ మీకు పట్టం కట్టే పరిస్థితిలో ప్రజలు లేరని మరి అభ్యర్థుల గురించి మీరు చెప్తే మా నాయకుడు ప్రకటించాలా మా నాయకుడు ఏ నిర్మాణం అయితే తీసుకుంటారు ఆ నిర్ణయానికి మేము జనసైనికులు మా నాయకులు కట్టుబడి ఉంటాం
175 నియోజకవర్గాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా జనసేన జెండా ఎగరడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదని కర్నూలు జిల్లా, ఆలూరు నియోజవర్గం జనసేన ఎరుకుల పార్వతి అన్నారు.