స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సిద్ధవటం జనసేన
సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో ఆజాదీకా అమృత్ దినోత్సవ్ కార్యక్రమంలో భాగంగా 76వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమే నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరం స్వాతంత్ర వేడుకలను నిర్వహించుకుంటున్నామని అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.