టిడిపి రాష్ట్ర బంద్ కు మద్దతు తెలిపిన చిర్రి బాలరాజు

పోలవరం నియోజకవర్గం: తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును శనివారం కక్షపూరితంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బంద్ కి పిలుపునిచ్చారు. ఇందుకుగాను జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జీలుగుమిల్లి మండలంలో సోమవారం బంద్ కి మద్దతుగా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ చిర్రి బాలరాజు పాల్గొనడం జరిగింది. నాలుగున్నర సంవత్సరాలుగా వైసిపి పాలనలో ప్రతిపక్షాలపై ఎన్నో రకాల దాడులు, హింసలు, అక్రమ కేసులు బనాయించి పైశాచికానందాన్ని పొందుతున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వకార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, దుకాణాలు బంద్ పాటించడం జరుగుతుందని చిర్రి బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జీలుగుమిల్లి మండలం అధ్యక్షులు పసుపులేటి రాము, జనసైనికులు పాల్గొన్నారు.