మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేసిన జనసేన

కొండపల్లి మున్సిపాలిటి, గత కొంతకాలంగా కొండపల్లి మున్సిపాలిటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పై మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందించిన జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం ఇన్చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు(గాంధీ). ఈ వేసవిలో మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య గురించి ప్రస్తావించి, ముఖ్యంగా పుట్లమ్మ గట్టు, అడవి క్వారీ, కొత్తగేట్, ఇబ్రహీంపట్నం శివారు ప్రాంతాల్లో సమస్య ఎక్కువ ఉంది అని సమస్య వెంటనే తీర్చాలని అప్పటివరకు వాటర్ ట్యాంకులను పంపాలని కోరారు, డ్రైనేజీ సమస్య ప్రస్తావించి వెంటనే పూడిక కార్యక్రమం మొదలు పెట్టాలని , ముఖ్యంగా ఎస్టి కాలనీ నందు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ ను బాగుచేసి కల్వర్టు నిర్మించాలని కోరారు, వీటిపిఎస్ నుండి వచ్చే కాలుష్య నివారణకు చర్యలు తీసుకొని వారితో మాట్లాడి మొక్కలు నాటించి, హెల్త్ క్యాంప్స్ నిర్వహించాలని, హిందూ స్మశాన వాటిక వద్ద చెత్తను వేయకుండా చర్యలు తీసుకోవాలని, ఎర్ర బ్రిడ్జి వద్ద ఊరు లోపలకి వచ్చే మార్గంలో సైన్ బోర్డ్ లు నిర్మించాలని, హైవే లో లైట్లు వెలగక పోవడం వల్ల జరిగే ప్రమాదాలు కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్ళారు.. సానుకూలంగా స్పందించి కమిషనర్, వీటిలో ప్రతి ఒక్క దానిమీద త్వరలోనే చర్యలు తీసుకుంటాము అని చెప్పారు. ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి నాని, యతిరాజుల ప్రవీణ్, రాగాల నాని, పగిడిపల్లి వెంకట్, దేవరకొండ చరణ్, చిట్టేలు కోటేశ్వరరావు, రామంజనేయులు తదితరులు పాల్గొన్నారు.