పలు కుటుంబాలను పరామర్శించిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం, గంగవరం మండలం సుందర పల్లి గ్రామం తాడాల తిరుపతి రాయుడు(సన్ ఆఫ్ నరసింగ రాయుడు)గారు ఇటీవల స్వర్గస్తులైనారు. బుధవారం రామచంద్రపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం జరిగింది. గంగవరం మండలం దంగేరు గ్రామం మేడిశెట్టి వీరభద్రం ఇటీవల స్వర్గస్తులైనారు. రామచంద్రపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం జరిగింది. వారి వెంట కుడుపూరు దంగేరు గ్రామాల జనసేన పార్టీ ఎంపిటిసి నందికోళ్ళ వీరవెంకట నాగేంద్ర, మేడిశెట్టి సూరిబాబు, రాంబాబు నాయుడు, గురుమెళ్ళ వంశీ తదితర జనసైనికులు వెళ్లి పరామర్శించడం జరిగింది.