లావేరు మండలంలో జనసేన భారీ బహిరంగ సభ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం కేంద్ర పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన లావేరు మండల ముఖ్య నాయకులు జనసైనుకుల సమావేశంలో కొన్ని ముఖ్యమైన మండల ప్రధాన సమస్యలపై ఏ విధంగా కార్యచరణ ఉండాలి మరియు పార్టీ బలోపేతం అనే అంశాలపై.. జనసేన నాయకులు కాంతిశ్రీ, విశ్వక్సేన్ సమక్షంలో అనేక విషయాలను చర్చా వేదికగా తెలియజేసారు. ఈ సమావేశంలో జనసైనికులు అందరూ కలిసి లావేరు మండలంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసైనుకులను నాయకులను ఒకే వేదికగా తీసుకొని వచ్చి లావేరులో జనసేనపార్టీ లేదు అనే భావనలో ఉన్న టీడీపీ, బీజేపీ, వైసీపీ పార్టీలకు చెక్ పెట్టే విధంగా ఉండాలని తెలియజేసారు. ఈ కార్యక్రమం 5-6-2022 తేదీ ఆదివారం భారీ ర్యాలీ మరియు సభను విజయవంతం చేయాలని తెలిపారు.