పేద వివాహిత మహిళకు అండగా జనసేన

విజయనగరం నియోజకవర్గం వై.ఎస్.ఆర్.సీ.పీ నాయకులు గుండా రాజకీయం చేస్తూ..పేద మహిళలే టార్గెట్ గా లైంగికంగా లోబర్చుకునే ప్రయత్నాలు, లేనియెడల బెదిరింపులు గురి చేస్తున్నారు. 27 వ డివిజన్ కార్పొరేటర్ అనుచరులు స్థానిక కే ఎల్ పురం లో నివసిస్తున్న పేద వివాహిత మహిళను లోబర్చుకునే ప్రయత్నం చేశారు. లొంగని ఎడల బెదిరింపులకు దిగారు, ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన నాయకులు హుసేన్ ఖాన్, చక్రవర్తి బాధితురాలును పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు, మరియు వైసీపీ నాయకులకు అధికార మదం ఎక్కిందని పేద మధ్య తరగతి వారి పై వీరి యొక్క ప్రతాపం చూపిస్తున్నారని వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని పేద ప్రజలకు అండగా జనసేన పార్టీ ఎప్పుడూ.. ఉంటుందని తెలియజేయడం జరిగింది, మరియు బాధితురాలికి ఒక బియ్యం ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొనడం జరిగింది.