టిటిడికి భక్తుల ప్రాణాలంటే లెక్క లేదా?: జనసేన

గోవిందరాజస్వామి సత్రాల వద్ద శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రంనందు టోకెన్ల కోసం భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య తోపులాట జరిగిన కారణంగా.. ముగ్గురికి గాయాలయ్యాయి, భక్తులను నిర్లక్ష్యం చేస్తూ వీఐపీల సేవలలో తరించడం చాలా బాధాకరం. సోమవారం రాత్రి నుంచి క్యూలైన్లలో ఉన్న భక్తులకు కనీసం మంచినీరు ఆహారం అందించని టిటిడి, సొమ్మసిల్లి పడిపోయిన మహిళలు, చిన్న పిల్లలు, పలువురికి వెంటనే తగు చికిత్స అందించాలి, ఒకేచోట కాకుండా టోకెన్లు మరొక మూడు చోట్ల పెంచినట్లయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి, ఇప్పటికైనా టిటిడి తగు చర్యలు చేపట్టి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని టిటిడి అధికారులను కోరుచున్నాం
అని కిరణ్ రాయల్ అన్నారు.