జన సమీకరణలో జనసేన

పెడన, ఈనెల 23వ తేదీన అమరావతి రైతుల మహా పాదయాత్ర పెడన నియోజకవర్గంలో అడుగుపెట్టనున్న తరుణంలో ఆ పాదయాత్రకు సంఘీభావం తెలియజేయవలసిందిగా రైతుల మద్దతును కూడగడుతున్న జనసేన పార్టీ నాయకులు. బుధవారం గూడూరు మండలంలోని అనేక గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల మద్దతులను కూడబెడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గూడూరు మండలం జక్కంచెర్ల గ్రామంలో ప్రజలను కలిసి మద్దతు కోరడమైనది. నాగారం మరియు ముక్కోలు గ్రామంలో ప్రజల మద్దతు కోరడమైనది. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు, గూడూరు మండల కార్యదర్శి శ్రీరాం సంతోష్, చీరల్ల నవీన్ కుమార్, ఓగ్గు సాయి, ముద్దినేటి రామకృష్ణ, సమ్మెట గణపతి కోలపల్లి చంద్రశేఖర్, మట్టి పూర్ణచంద్రరావు, సమ్మెట చంద్రశేఖర్, పాశం నాగమల్లేశ్వరరావు, పినిశెట్టి రాజు, పసుపులేటి రాజేష్ మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.