టీటీడీ FMS కార్మికుల న్యాయపోరాటానికి అండగా వారికి రెండవ రోజు కూడా భోజన వసతులను ఏర్పాటు చేసిన జనసేన

తిరుపతి, గత 8 రోజులుగా టీటీడీ FMS కార్మికులు తిరుపతి ఎ డి బిల్డింగ్ వద్ద మాకు న్యాయం చేయండి అని చేస్తున్న నిరసనకు మద్దతు గా జనసేన వారి సమస్యల పరిష్కారం కొరకు ఎంత దూరమైన పోరాడుతామని మీకు అండగా మేమున్నామంటూ…. శుక్రవారం వారికి సుమారు 1000 మందికి పైగా చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ శ్రీ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో వారికి భోజన వసతులను ఏర్పాటు చేయడం జరిగింది… ఈ సందర్భంగా శ్రీ హరిప్రసాద్ మాట్లాడుతూ రెండు, మూడు రోజులు మాత్రమే మేము అన్నం పెట్టగలం కానీ మా లక్ష్యం మీరు జీవితాంతం కడుపునిండా అన్నం తినాలనే చేయాలనే ఆకాంక్షతో మీకు అండగా మద్దతు తెలియజేస్తున్నాం, మీ సమస్యల పట్ల జనసేన పార్టీ ఎప్పుడు మీకు అండగా, తోడుగా మీ న్యాయపరమైన పోరాటానికి ఎలాంటి నిరసనలకు అయినా జనసేన ముందుంటుందని తెలియజేశారు… ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి పట్టణ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.