చేనేత కుటుంబానికి అండగా జనసేన

అనంతపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలో మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో గుండెపోటుతో మృతి చెందిన చేనేత కార్మికుడి కుటుంబాన్నీ పరామర్శించి, ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తన తండ్రి చనిపోయిన తర్వాత చిన్న కుమార్తె చదువు ఆగిపోవడంతో జనసేన పార్టీ తరుపున ఆమె చదువుకు సంబంధించి మేము బాధ్యత తీసుకుంటాం అని ఆ తల్లికి ఆ చెల్లికి భరోసా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జనసేన వీర మహిళ కుమారి రూపా మారిశెట్టి, జనసైనికులు రాజ్ ప్రకాష్, ధను రామ్, శ్రీశైలం శివకుమార్, వన్నూ శ్రీరాములు, గంగాధర్, అది, పుల్లప్ప, అశోక్, కార్తిక్, రాము, తదితరులు పాల్గొన్నారు.