దూసుకుపోతున్న చంద్రగిరి నియోజకవర్గం జనసేన

జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ జిల్లాలో 4 రోజుల విస్తృత పర్యటనలో భాగంగా, 4వ రోజు పర్యటన చంద్రగిరి నియోజకవర్గంలో నియోజకవర్గ నాయకులు దేవర మనోహర మరియు జిల్లా కార్యదర్శి నాసీర్ ఆధ్వర్యంలో జరిగిన మండల కమిటీ సభ్యుల సమీక్షా సమావేశంలో జిల్లా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి మండల అధ్యక్షులకు మరియు మండల కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఓటర్కి, లీడర్ కి మధ్య అనుసంధానంగా పనిచేస్తూ మండల, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా విది విధానాలను అనుసరిస్తూ నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలను పార్టీలోకి ఆహ్వానించాలని సూచించారు. అదేవిధంగా మిషన్ 3000 అనే బృహత్తర కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, యువతి యువకులు పార్టీలో కీలక పాత్ర పోషించే విధంగా నాయకులు పార్టీ అధ్యక్షుల గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాలు నిర్వాహక కమిటీ కో ఆర్డినేటర్ పగడాల మురళి, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, రాష్ట్ర డాక్టర్ సెల్ జనరల్ సెక్రెటరీ సింగిరి బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, జిల్లా జనరల్ సెక్రెటరీ తులసీ ప్రసాద్, జిల్లా కార్యదర్శులు కలప రవి, బాటసారి, లావణ్య కుమార్, ఆనంద్ మరియు చంద్రగిరి నియోజకవర్గ మండల అధ్యక్షులు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.