వరదలోనూ త్రాగునీటి సరఫరా చేస్తున్న జనసేన ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు అడ్డాలపాలెం గ్రామానికి చెందిన పంచదార వేంకటేష్ ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా సోమవారం వరద ప్రాంతం సఖినేటిపల్లి లాకుదగ్గర మరియు గొంది పద్మరాజుగారి కాలనీ ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని, గెలిచిన నాయకులు వరద వస్తే ప్రజలను గాలికి వదిలేస్తే ఓటమిపాలైన జనసేనపార్టీ మాత్రం వరద బాధితులకు వరదలలోను త్రాగునీరు అందిస్తుందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.