బడుగు బలహీనవర్గాలకు అండగా జనసేన

మర్రిపాడు మండలం బడుగు బలహీనవర్గాలకు అండగా జనసేన పార్టీ ఎల్లవేళలా ముందుంటుందని తెలియ పరచడానికి ఇది ఒక నిదర్శనం. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఎన్నో ప్రభుత్వాలు మారినా గాని బడుగు బలహీన వర్గాల ప్రజలను ఇంకా రాతియుగంలో మాదిరిగానే చూస్తున్నారు. దానికి నిలువెత్తు నిదర్శనంమనం పడమటి నాయుడుపల్లి ST కాలనీ చవి చూస్తున్నాం. ఇప్పటికి ఎన్ని ప్రభుత్వాలు మారినా వీధుల్లో నడవడానికి సరైన రోడ్లు లేకపోవడం ఎంతో దురదృష్టకరం వెలిగి వెలగని వీధి లైట్లతో ఈ తుఫాన్ కాలంలో ఏ పక్క నుంచి ఏ పురుగు వస్తుందో ఏ పాపం వస్తుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఇకనైనా ఈ పాలకులు మొండి నిర్లక్ష్య వైఖరి మార్చుకుని వెంటనే సిమెంట్ రోడ్లు వేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అవినీతి ఉందో అక్కడ ప్రజలకు అండగా జనసేన పార్టీ ఉంటుంది.అదేవిధంగా ఎక్కడైతే ప్రజలు పడుతున్నారో వాటిని తెలుసుకుని వెంటనే పరిష్కరించకపోతే మర్రిపాడు మండలం జనసేన పార్టీ ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం.