Hyderabad: ఉప్పల్ నియోజకవర్గం జనసేనలో భారీ చేరికలు

ఉప్పల్ నియోజికవర్గంలో కుషాయిగూడాలో గల జనసేనపార్టీ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారాం రాజలింగం ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి వివిధ పార్టీల నుంచి జనసేనపార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ సభ్యత్వం తీసుకున్నారు… ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాజలింగం మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో జనసేనపార్టీ రోజురోజుకీ బలపడుతుందని రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు మరో ప్రత్యామ్నాయ పార్టీగా మారనుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రేటర్ కమిటీ సెక్రెటరీ నందగిరి సతీష్ మరియు రాష్ట్ర వీర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ రత్నా పిల్ల, నీహారిక మరియు చర్లపల్లి డివిజన్ అధ్యక్షులు శివ కార్తిక్, నాచారం డివిజన్ అధ్యక్షులు రామకృష్ణ పాల్గొన్నారు.