గిడ్డి సత్యనారాయణని అభినందించిన జనసేన నాయకులు

పి.గన్నవరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పి.గన్నవరం నియోజకవర్గం ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణని నియమించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయుటకు పెదపట్నం గ్రామంలో గ్రామశాఖ పుచ్చల శేఖర్ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సర్పంచ్ గుబ్బల దుర్గ, పండు, ఎంపీటీసీ కడలి పద్మావతి, భాను వార్డు మెంబర్స్ కోన మాచర, ఆకుల శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి తోరం యువరాజు, నాయకులు కోడెటి చిన్న, కొమ్ముల బుజ్జి, ముత్యాల రామం, కొమ్ముల శివసాయి, వైవీ, ముత్యల చంటి, ఈ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది.